జైనథ్ లో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
చిత్రం న్యూస్, జైనథ్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను వంచిస్తోందని, అవినీతి అరాచక పాలన కొనసాగిస్తోందని ఆరోపిస్తూ అసెంబ్లీకి ముట్టడికి వెళ్తున్న బీజేపీ జైనథ్, భోరజ్ మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గాజుల సన్నీ పలువురు బీజేపీ నాయకులను జైనథ్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ముందస్తు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం వేకువజమున సొంత పూచీ కత్తుపై విడుదల చేశారు.