-Advertisement-

నీటి వనరులను సంరక్షించాలి 

చిత్రం న్యూస్, బేల: సకల జీవరాసులకు ప్రాణధారమైన నీటిని వాడుతూ భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచ్ క్యాతం పొచ్చక్క సురేష్ రెడ్డి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకుని బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు..వారు మాట్లాడుతూ బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో ఊరురా నీటి ప్లాంట్లను ఏర్పాటు చేసి శుద్ధ జలాలను అందించడం అభినందనీయమన్నారు శుద్ధ జలంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, వితంతువులకు సాయం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆ సంస్థ సేవలను కొనియాడారు  కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు మమత, బాలవికాస సంస్థ ప్రతినిధి నరేందర్ బోయర్,  గ్రామస్తులు గోదూరి భూమన్న కృష్ణారెడ్డి, భూమారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments