-Advertisement-

భజన పోటీల విజేత రవీంద్రనగర్ బృందం

చిత్రం న్యూస్, భీంపూర్: శ్రీరామ నవమిని పురస్క రించుకుని కరంజి-టిలో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు సాగిన భజన పోటీల్లో విజేతగా ఆదిలాబాద్ పట్టణం రవీంద్ర నగర్ భజన బృందం ప్రథమ బహుమతి సాధించి విజేతగా నిలిచింది. తలమడుగు మండలం బరంపూర్ ( ద్వితీయ), న్యూ హౌసింగ్ బోర్డు, ఆదిలాబాద్ ( తృతీయ), దిగ్రస్, మహారాష్ట్ర( నాల్గవ ), సాంగిడి, బేల ( ఐదవ), గుబిడి, భీంపూర్ (ఆరవ ),కరంజి -కే, జైనథ్ (ఏడవ) బహుమతి సాధించారు. విజేతలకు సర్పంచ్ కల్చాప్ యాదవ్, గ్రామ పెద్దలు నరేందర్ యాదవ్, రమేష్, దేవా రెడ్డి, ఉద్దవ్, తదితరులు నగదు బహుమతులు అందజేసి అభినందించారు. జైనథ్ మండలం కరంజి -కే భజన బృందం కళాకారుడు భగవాన్ రెడ్డి ఉత్తమ గాయకుడి బహుమతి గెలుచుకున్నారు. కాగా ఈ పోటీలకు ఆదిలాబాద్, తలమడుగు, జైనథ్, తాంసి, బేల మండలాల భజన బృందాలతో పాటు సరిహద్దు మహారాష్ట్ర గ్రామాల నుంచి 22 భజన బృందాలు పాల్గొన్నాయి. భజన కళాకారులు తమ గానంతో అలరించారు. న్యాయ నిర్ణేతలుగా ఉమేష్, ఆనంద్, రమేష్ యాదవ్ వ్యవహరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments