చిత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రతినిధి: జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న వెంగన్నపాలెం గ్రామంలో గత నెల 19న గురువారం ర తంబర్ల నరసింహారావు తల్లి తంబర్ల లక్ష్మీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షులు.డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ వెంగన్నపాలెం గ్రామంలో ఉన్న తంబర్ల నరసింహారావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి, ఆయనకు ఆయన కుటుంబానికి మనోధైర్యం తెలియజేశారు, నర్సింహారావు బహుజన ఉద్యమాల్లో కీలకపాత్ర వహిస్తూ ప్రజల కోసమే పాటుపడినటువంటి వ్యక్తి ఇప్పుడు జర్నలిస్టుగా తన సేవలు ప్రజలకు అందిస్తూ చురుగ్గా ఉంటున్న సమయాన తన ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు.ఈ కార్యక్రమంలో రవి, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


