సారంగపూర్ లో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వంపై అవగాహన సదస్సు
చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) సొసైటీ ఆధ్వర్యంలో జామ్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్.పి.ఓ)లో రైతులకు సభ్యత్వంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంస్థ అసిస్టెంట్ రిజిస్టార్ నారాయణ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులు సమూహంగా ఏర్పడితే వారి పంటల ఉత్పత్తి, కొనుగోలు, నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. రైతులు సమష్టిగా కృషి చేయడం వల్ల మార్కెట్లో మంచి ధర పొందవచ్చని,...