Chitram news
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 6:31 pm Editor : Chitram news

సారంగపూర్ లో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యత్వంపై అవగాహన సదస్సు

చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) సొసైటీ ఆధ్వర్యంలో జామ్ గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్.పి.ఓ)లో రైతులకు సభ్యత్వంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సంస్థ అసిస్టెంట్ రిజిస్టార్ నారాయణ మాట్లాడుతూ.. చిన్న, సన్నకారు రైతులు సమూహంగా ఏర్పడితే వారి పంటల ఉత్పత్తి, కొనుగోలు, నిల్వ, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలు సులభతరం అవుతాయని తెలిపారు. రైతులు సమష్టిగా కృషి చేయడం వల్ల మార్కెట్లో మంచి ధర పొందవచ్చని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు ఈ సందర్భంగా, రైతు సమూహానికి ప్రభుత్వం అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తుందని, దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ అవగాహనతో అనేకమంది రైతులు ఎఫ్.పి.ఓలో సభ్యత్వం పొందడానికి ముందుకు వచ్చారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రవళి విలాస్, స్థానిక నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /