Chitram news
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 8:04 pm Editor : Chitram news

చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

చిత్రం న్యూస్, బేల: మతం మారిన ఆదివాసులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఈ నెల 24 న నిర్వహించ తలపెట్టిన చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చాంద్పెల్లి రాయిసెంటర్ సార్మెడీ కోరేంగే సోనేరావు పోలుపునిచ్చారు. శనివారం గిరిజన సురక్ష మంచ్ ఆధ్వర్యంలో బేల మండల కేంద్రంలో  “చలో దిల్లీ” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సార్మెడీ సోనేరావు పటేల్ మాట్లాడుతూ.. బేల మండలంలోని 9 తెగల ఆదివాసీ పెద్దలు,పటేల్, దేవరీ, మహాజన్, గ్రామ సర్పంచ్ లు అన్ని సంఘాల నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు జిల్లా నుండి వేల సంఖ్యలో ఆదివాసీలు దిల్లీకి వెళ్ళి మన ఐక్యతను చాటాలన్నారు .ఈ కార్యక్రమంలో మెస్రం కిషన్, రితేష్ పూసం, నైతం హేమంత్, కిరణ్, మోహన్, పటేల్ తదితరులు పాల్గొన్నారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /