చిత్రం న్యూస్, ముథోల్ : రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. నిర్మల్ జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పర్వదినం విశిష్టతను వివరిస్తూ మత పెద్దలు బోధనలు చేశారు. పేద ముస్లిం కుటుంబాలకు దాన ధర్మాలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండంలో ఈద్గాల వద్ద మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభు త్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదేవిధంగా బడ్జెట్లో సైతం పెద్ద ఎత్తున మైనార్టీ సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నా రు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /


