Chitram news
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 8:49 am Editor : Chitram news

కొండగట్టుకు కాలినడకన అంజన్న భక్తులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం బిదిరెల్లి గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు శనివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొండగట్టుకు పాదయాత్రగాబయలుదేరారు. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఒకటి. భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న కొండగట్టు ఆంజనేయస్వామి అయితే అక్కడ ప్రత్యేకత హనుమాన్ మాల దీక్ష తీసుకున్న వారు మండల కాలం దీక్షను కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు. మాల విరమణ చేయాలంటే అంజన్న భక్తులు తమ స్వ గ్రామం నుండి ఎక్కువగా పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని అక్కడ స్వామి వారిని దర్శించుకుని మాల విరమణ చేస్తారు. అంజన్న మాల వేసుకున్న భక్తులు ఎక్కువగా కాలినడకన అంజన్నకు దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే… హనుమంతుని అంత బలశాల కావాలని అంజన్న కరుణ మనపై ఉండాలంటే ఇలా నదక ద్వారా రావడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. 180 కిలోమీటర్ మారంలో ఉన్న కొండగట్టుకు మండేటి ఎండలో నడుచుకుంటూ వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో కొండగట్టుకు బయలుదేరారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /