ఆర్జీయూకేటీ బాసర విద్యార్థిని తేజస్విని మృతిపై వైద్య నివేదిక వెల్లడి
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పి.యు.సి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లెపూడు తేజస్విని మరణానికి గల కారణాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నివేదికలు ధ్రువీకరించాయి. శుక్రవారం అందిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం, తేజస్విని అక్యూట్ లుకేమియా బ్లాస్ట్ సెల్ (బ్లడ్ క్యాన్సర్ - 4వ స్టేజి) తో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న తేజస్వినికి ఆర్జీయూకేటీ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి...