గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో పయనించాలి:ప్రముఖ బౌద్ధ బిక్షువు ధమ్మ బోధి
చిత్రం న్యూస్ ముథోల్ : ప్రపంచానికి శాంతి, అహింసను బోధించిన గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో పయనిద్దామని ప్రముఖ బౌద్ధ భిక్షువు ధమ్మ బోధి అన్నారు. మండల కేంద్రమైన ముథోల్లోని నాగ్ సేన్ నగర్ లోని శీల్ శాంతి బుద్ధ విహార్ లో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఖేర్ దాన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సమతా సైనిక్ దళ్ సైనికులు కవాతు నిర్వహించారు. అనంతరం గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్...