చిత్రం న్యూస్, అదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెం 20 భాగ్యనగర్ కాలనీలోని వనిత రమేష్ దంపతుల ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశానికి ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి హాజరై ప్రారంభించారు. కంది శ్రీనన్న కానుకను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గూడు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిన మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు.కొత్త ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తమ్మల చందు, భూపేందర్, సాయి, అజయ్, కాలనీవాసులు పాల్గొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /

