చిత్రం న్యూస్, ఇచ్చోడ: వైద్యుడు డాక్టర్ ఆశిష్ కేంద్రే అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పిన్న వయస్సులో ఆయన మరణం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, గ్రామస్తులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఇచ్చోడలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు శంకర్ డాక్టర్ కుమారుడైన డాక్టర్ ఆశిష్ కేంద్రే, కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.డాక్టర్.ఆశిష్ కేంద్రే తన వృత్తిలో నిబద్ధతతో, రోగుల పట్ల సేవా దృక్పథంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం వైద్య రంగానికి కూడా తీరని లోటు. ఈ విషాద వార్తతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు శంకర్ డాక్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.


