*ఇఫ్తార్ విందులో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి
చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ని యోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత , తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఆని ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, ఎంఐఎం అధ్యక్షులు నజీర్,బోథ్ మా జీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్, తొడసం దౌలత్ రావు, చిట్యాల గంగన్న,సంతోష్, కాడే సంతోష్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


