చిత్రం న్యూస్, సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ సన్నిధిలో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలతో పాటు మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై, శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేక్ కట్ చేసి, రాజేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /

