చిత్రం న్యూస్ భైంసా: భైంసా పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్యవర్గాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు.భైంసా పట్టణంలోని పిప్రి కాలనీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన భైంసా మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రేయతో పాటు వివిధ వార్డులకు ఎన్నికైన కౌన్సిలర్లను సంఘం ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం పట్టణ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని కోరారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /

