చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సవర్గం గ్రామంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని గోదావరి పుష్కర ఘాట్ వద్ద కొలువుదీరిన నందీశ్వరుడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దల నాటినుండి సాంప్రదాయంగా వస్తున్న ఉగాది పండగ రోజున ఊరంతా కలిసి గోదావరి నది ఒడ్డున కొలువుదీరిన నందీశ్వరుడికి గ్రామస్తులందరూ వెళ్లి అభిషేకాలు చేసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ గదేకర్ ముత్తుభాయ్ మాట్లాడుతూ.. గోదావరి నది ఒడ్డున కొలువైన నందీశ్వర క్షేత్రం చాలా ఏళ్ళ కితం నాటిదన్నారు. ఈ గుడి అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఉప సర్పంచ్ మంజూష, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /

