చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బొర్రా గణేష్ కాలనీలో వీధి కుక్కల దాడిలో కురుమే జిన్నన్నకు చెందిన 8 మేకలు మృతి చెందాయి. గత కొన్ని నెలల క్రితం గ్రామస్తులపై దాడి చేయడం కూడా జరిగింది. ఇప్పటికైన అధికారులు, నాయకులు స్పందించి. వీది కుక్కల దాడుల నుండి పశువులను, ప్రజలను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. వీధి కు దాడిలో 8 మేకలు మృతి చెందడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని జిన్నన్న వేడుకుంటున్నారు.


