-Advertisement-

పాఠశాలలో ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలు

చిత్రం న్యూస్, భైంసా: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం మండల పరిషత్ పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థు లకు ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత, విశిష్టతను హెచ్ఎం రాధిక వివరించారు. ఉగాది అనగా నూతన సంవత్సరానికి ఆరంభమని, ప్రకృతి మరియు కాల చక్రంలో చోటుచేసుకునే మార్పులను అనుసరించి ఈ పండుగను జరుపు కుంటామని పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేశారు.ఉగాది పండుగలో ముఖ్యమైన ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, దానిలోని పదార్థాలు జీవితంలోని ఆనందం, దుఃఖం, కోపం, ఆశ్చర్యం వంటి అనుభవాలకు ప్రతీకలని చెప్పారు. అనంతరం విద్యార్థుల చేతనే ఉగాది పచ్చడిని తయారు చేయించి, అందరికీ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ఉగాది పాటలు, భక్తి గీతాలపై నృత్య ప్రదర్శనలు చేసి అందరిని అలరించారు. చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, లక్ష్మణ్, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments