Chitram news
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 12:36 pm Editor : Chitram news

అమ్మాయిలు పరిశోధన లో ముందు ఉండాలి: ప్రొ.అర్చనl

చిత్రం న్యూస్ బేల: ప్రస్తుత పరిస్థితిలో వృక్ష శాస్త్రంలో పరిశోధనలు చాలా అత్యవసరము అని అందులో అమ్మాయిలు మరింత ముందు ఉండాలని మహారాష్ట్ర లోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని కలంబ్ వృక్ష శాస్త్ర అధిపతి ప్రొ. అర్చన రాందాస్ ముకథేకర్ అన్నారు. ప్రొ .అర్చన ‘ఇండియన్ ఫోరమ్ ఆఫ్ సోషల్ లీడర్స్ ” తమిళనాడు నుండి ఉత్తమ మహిళ అధ్యాపకులు 2026 గా అవార్డ్ పొందిన సందర్భంగా తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజి విద్యార్థుతో వెబినార్ ద్వారా మాట్లాడి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ డా. వరప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ పుష్ప, కో ఆర్డినెటర్ సాగర్, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.