Chitram news
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 6:57 pm Editor : Chitram news

ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన

చిత్రం న్యూస్ కాగజ్ నగర్ : ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజాలైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చిన 22 మందిని పరీక్షించగా అందులో 14 గురికి ఆపరేషన్ అవసరమని వారికి విడతల వారిగా ఆపరేషన్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించబడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ శాసనసభ్యులు, ఫౌండేషన్ అధ్యక్షులు డా.పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.