హెచ్పీవీ వ్యాక్సినేషన్ పై అపోహలు వీడాలి : జిల్లా వైద్యాధికారి రాజేందర్
చిత్రం న్యూస్, నిర్మల్ : గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ పాపిల్లో వైరస్ (హెచ్పీవీ ) వ్యాక్సినేషన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు వీడాలని నిర్మల్ జిల్లా వైద్యాధికారి డా.రాజేందర్ సూచించారు. జామ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ఒక ప్రధాన సమస్యగా మారిందని డాక్టర్...