-Advertisement-

ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా 

చిత్రం న్యూస్, నిర్మల్ :  ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.48 గంటల ధర్నాలో భాగంగా నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ ఎండాకాలంలో రోడ్డు వేడితో ఉన్న ఆశా వర్కర్లు రోడ్డుపై భైఠాయించారు గంటపాటు ధర్నా చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుందని వెంటనే వారి సమస్యలను పరిష్కరించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం రూ. 26వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లకు 18 వేలు కచ్చిత వేతనాన్ని ప్రకటించాలన్నారు. సమాజంలో ఆశా వర్కర్ల పాత్ర గణనీయమైనదని కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేస్తామని, పని భద్రత కల్పిస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం ఈ హామీలను మర్చిపోయిందన్నారు.వెంటనే ఇచ్చిన హామీలపై నిలబడి పరిష్కారం చేయాలని, లేనియెడల కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశాలకు మద్దతుగా అంగన్వాడీ యూనియన్ మద్దతు తెలిపారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శైలజ,  ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత, కార్యదర్శులు పీ.గంగామణి, ఉపాధ్యక్షులు విజయ, చంద్రకళ, ఇంద్రమ్మ, నంద,సుగ్న,పద్మ, సహాయ కార్యదర్శులు, కమల, రామలక్ష్మి మంగ, శ్యామల, సులోచన, అనసూయ, జ్యోతి, వినోద తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments