చిత్రం న్యూస్, ఉట్నూర్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ మృతి పట్ల టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గోవింద్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. అజ్మీర గోవింద్ నాయక్ ప్రజల కోసం అంకితభావంతో సేవలందించిన ప్రజానాయకుడని కొనియాడారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని తెలిపారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. గోవింద్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.