Chitram news
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 11:19 am Editor : Chitram news

బాసర అతిథి భవనంలో స్వచ్ఛభారత్  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర డార్మెంటరీ అతిథిభవనంలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ఏఈఓ గంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 30 మంది వాగ్దేవి సొసైటీ సిబ్బంది,హుడా సిబ్బంది స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అతిథి గృహంలోని బాత్రూం టాయిలెట్స్ లలో యాసిడ్, ఫినాయిల్ తో క్లీన్ చేయించారు. స్నానపు గదులతో పాటు హాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్తాచెదారం లేకుండా శుభ్రపరిచారు. భక్తులు సద్వినియోగం చేసుకునే ప్రతి ఒక్క రూమును నీటితో శుభ్రపరిచారు. భక్తులు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏఈఓ గంగా శ్రీనివాస్ కోరారు.