ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు బోర్లను వేయించిన మామ్మాయి రమేష్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఓటమి కూడా అడ్డంకి కాలేదని మామ్మాయి రమేష్ నిరూపించాడు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ గ్రామానికి నీటి సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతో మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ మామ్మాయి రమేష్ రెండు బోర్లను వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామంలో గత కొంతకాలంగా తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రజలతో సమావేశాలు నిర్వహించిన...