పశువులకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు
చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మణియార్ పూర్, గూడ, గ్రామాల్లో శుక్రవారం పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్య అధికారి డాక్టర్ దీప్ రతన్ మాట్లాడుతూ ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం పశువులకు ఉచితంగా గాలి కుంటు నివారణ టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ పశువులకు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ఠాక్రే జ్యోష్ణా గంభీర్, నాగేసెన్, అశోక్, దిలీప్, రితేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.